కావలసినవి :
కాలీఫ్లవర్ : ఒకటిపెరుగు : 2 కప్పులు
కార్న్ఫ్లోర్ : 50 గ్రా
కారం : 1 టీ స్పూన్
మైదా : 75 గ్రా
ఉల్లిపాయలు : మూడు
అల్లం వెల్లుల్లి : 10 గ్రా
కొత్తిమీర : 1 కట్ట
జీలకర్రపొడి : 1 టి స్పూన్
జీడిపప్పు : 20 గ్రా
కారం : 1/2 టి స్పూన్
కొబ్బరి : చిన్నముక్క
ఫుడ్కలర్ : చిటికెడు
గరంమసాలా : 1/4 టి స్పూన్
ఉప్పు : తగినంత
పసుపు : 1/4 టి స్పూన్
రిఫైన్డ్ ఆయిల్ : వేయించేందుకు
తయారి విధానం :
కాలీఫ్లవర్ (గోబీ)ని పువ్వులుగా కొసి ఉప్పు నీళ్లలో వేసి కొంచెం మెత్తగా
ఉడికించి నీళ్లు వార్చి, పక్కన ఉంచండి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, మైదా
పోసి కొంచెం నీళ్లు కలిపి బజ్జీల పిండిలా చేశాక, అల్లం వెల్లుల్లి ముద్ద,
సన్నగా తరిగిన కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, రెడ్ ఫుడ్ కలర్, తగినంత
ఉప్పు కలపండి. తరువాత ఈ విశ్రమంలో గోబీ పువ్వులను ముంచి వేడి నూనెలో
వేయించి గ్రేవీలో వేసి, రైస్తో గాని, రోటీతో గాని ఆరగించండి.గ్రేవీ తయారి...
పెరుగులో కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి తురుము, గరంమసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కలిపి మిశ్రమంలా చేసి ఉంచండి. ఒక గిన్నెలో నూనెపోసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించండి. అందులో పైన తయారు చేసి ఉంచిన పెరుగు మిశ్రమాన్ని కలిపి పది నిమిషాలు ఉడికించితే గ్రేవీ సిద్ధం.
No comments:
Post a Comment