కావల్సినవి: రైస్
నూడుల్స్ - పావుకేజీ, జీడిపప్పు, వేరుసెనగపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు
- అన్నీ కలిపి పావుకప్పు, యాలకులపొడి, - అరచెంచా, ఆకుపచ్చ రంగు
- కొద్దిగా, బెల్లం - 200 గ్రా, నూనె, లేదా నెయ్యి - తగినంత.
తయారీ:
నూడుల్స్ ఉడికించి చల్లారాక నీళ్లు ఒంపేయాలి. బాణలిలో సగం వరకూ నూనె పోసి కాచి, చిల్లుల గరిటెలో నూడుల్స్ తీసుకొని మరో గరిటెతో ఒత్తిపట్టుకొని దాన్లో ఉంచాలి. బంగారువర్ణంలోకి వచ్చాక బయటకు తీస్తే బుట్ట ఆకృతి వస్తుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బెల్లం తురుము తీసుకుని, ఆకుపచ్చరంగు కలిపి పాకం పట్టాలి. ముదురుగా వచ్చాక దాన్లో నెయ్యి, యాలకుల పొడి వేసి దించాలి. పాకం వేడిగా ఉండగానే నూడుల్స్ బుట్టల్ని వేసి కాసేపు ఉంచి తీయాలి. వీటిలో జీడిపప్పు, వేరుసెనగ, ఎండుద్రాక్ష, ఖర్జూరాల్లాంటివి వేసుకుంటే.. సరి.
తయారీ:
నూడుల్స్ ఉడికించి చల్లారాక నీళ్లు ఒంపేయాలి. బాణలిలో సగం వరకూ నూనె పోసి కాచి, చిల్లుల గరిటెలో నూడుల్స్ తీసుకొని మరో గరిటెతో ఒత్తిపట్టుకొని దాన్లో ఉంచాలి. బంగారువర్ణంలోకి వచ్చాక బయటకు తీస్తే బుట్ట ఆకృతి వస్తుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బెల్లం తురుము తీసుకుని, ఆకుపచ్చరంగు కలిపి పాకం పట్టాలి. ముదురుగా వచ్చాక దాన్లో నెయ్యి, యాలకుల పొడి వేసి దించాలి. పాకం వేడిగా ఉండగానే నూడుల్స్ బుట్టల్ని వేసి కాసేపు ఉంచి తీయాలి. వీటిలో జీడిపప్పు, వేరుసెనగ, ఎండుద్రాక్ష, ఖర్జూరాల్లాంటివి వేసుకుంటే.. సరి.
No comments:
Post a Comment