కావలసిన పదార్థాలు:
ఉప్పుడు బియ్యం - ఒక కప్పు, మామూలు బియ్యం - రెండు
కప్పులు, మినప్పప్పు- అర కప్పు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర
కట్టలు - రెండు, అల్లం ముద్ద - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు -
నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.తయారుచేయు విధానం:
ఉప్పుడు బియ్యాన్ని వేడినీళ్లలో ఉదయాన్నే నానపెట్టుకోవాలి. మామూలు బియ్యాన్ని చల్లటి నీళ్లలో నానపెట్టుకోవాలి. మినప్పప్పు, శెనగపప్పుని కూడా నానపెట్టాలి. సాయంత్రం అయ్యాక వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. మర్నాడు అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర తురుముని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని దోశలపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి ఈ పిండితో దోశలు వేసుకోవాలి.
No comments:
Post a Comment