పూరీకి కావలసినవి:
ఉప్మారవ్వ (సన్నది) - కప్పు
మైదా - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా - చిటికెడు
నూనె - వేయించడానికి తగినంత
పానీకి కావలసినవి:
చింతపండు గుజ్జు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు; జీలకర్ర పొడి (వేయించి పొడి చేయాలి)- టేబుల్ స్పూన్; జీలకర్ర - టేబుల్స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్
న ల్ల ఉప్పు - టేబుల్ స్పూన్
బెల్లం - 2 టేబుల్స్పూన్లు
తయారి:
పానీకోసం పై చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి.
పూరీ కోసం ...
రవ్వ, మైదా, బేకింగ్సోడా, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పిండి మీద తడి క్లాత్ వేసి పదిహేను నిమిషాలు ఉంచితే మృదువుగా అవుతుంది. చిన్నచిన్న పిండి ముద్దలు చేసి మైదా లేదా రవ్వను అద్దుకుంటూ పీట మీద ఒత్తాలి. వీటిని కడాయిలో నూనె వేడయ్యాక వేసి రెండు వైపులా కాల్చి, బయటకు తీయాలి. ఈ పూరీలను పానీతో సర్వ్ చేయాలి.
Will try @ home :-)
ReplyDelete