కావలసిన పదార్ధాలు...
మష్రూమ్స్ : 100 గ్రా.పనీర్ : 100 గ్రా.
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్లు
పచ్చి మిర్చి : 4 (తరిగి)
ధనియాల పొడి : 1 టీస్పూన్
గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్
కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : అలంకరణకి
తయారు చేసే విధానం...
మష్రూమ్స్ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. పనీర్ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్ వేసి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment