
కావలసిన పదార్థాలు:
మైదా: 2cups
బేకింగ్ పౌడర్: 1tsp
పంచదార: 2cups
లోఫాట్ మిల్క్: 120grms
కొబ్బరి తురుము: 1/4cup
తినే సోడా: చిటికెడు
పైనాపిల్ ఎసెన్స్: 1tsp
కోడి గుడ్లు: 2
వెన్న: 100grsm
తయారు చేసే విధానం:
1. మొదటగా పంచదారను మెత్తగా పొడి చేసుకొని, మైదా పిండిని జల్లించుకోవాలి.
2. పాలలో మైదాపిండిలో బేకింగ్ సోడా, వెన్న వేసి కలపాలి. ఒక రోజూ ముందే మైదాను తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. అలా చేస్తేనే బిస్కెట్స్ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి.
3. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల్ల సొన మాత్రం తీసుకొని బాగా గిలకొట్టాలి. దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. తరువాత గుడ్డు సోనాలో పైనాపిల్ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి. చక్కెర మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి.
4. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిపైనే కొబ్బరి తురుమును చల్లి ఉంచాలి.
5. ఇప్పుడు కేక్ పాన్ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్ ను పెట్టి బేక్ చేయాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. అంతే పైనాపిల్ బిస్కెట్స్ రెడీ.
No comments:
Post a Comment