కావలసిన పదార్దాలు :
తోటకూర : 3 కట్టలు
ఉల్లిపాయ : 1
మెంతులు : 1 స్పూను
పచ్చిమిర్చి : 3
చింతపండు : నిమ్మకాయంత
ఉప్పు, కారం : తగినంత
అల్లం : చిన్నముక్క
నూనె : 3 స్పూన్లు
ఇలా చేయాలి...
తోటకూర కడిగి సన్నగా తరగాలి. అల్లం, ఉల్లిపాయలు ముక్కలుగా, పచ్చిమిర్చిని చీలికలుగా తర గాలి. చింతపండును నీటిలో నానబెట్టాలి. బాణాలిలో నూనె పొయ్యకుండా మెందులు వేసి వేపా లి. తర్వాత తరిగిన తోటకూర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒకసారి కలిపి చింతపండు రసం పిసికి అందులో పోసి కారం వేసి, సరిపడ నీళ్ళుపోసి ఉడకనివ్వాలి. దించేసే ముందు విడిగా తాలిం పు పెట్టి అందులో వెయ్యాలి. అన్నీ ఉడికాక దించెయ్యాలి. వెల్లుల్లి రెండు గర్భాలు వేయాలి.
No comments:
Post a Comment