
కావలసినవి:
బియ్యం - పావు కేజీ, ఏలకులు - 2, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు కప్పులు, బాదం పప్పు - 10, జీడిపప్పులు - 10, కిస్మిస్ - 10, ఉప్పు - తగినంత, నూనె - చిన్న గిన్నెడు, నెయ్యి - రెండు టీ స్పూన్లు
తయారి:
బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కొలత బియ్యానికి ఒకటిన్న నీరు పోసి అన్నం వండి పక్కన ఉంచాలి. కొత్తిమీర ఆకులను తుంపి శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసిపక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక అందులో ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరవాత కొత్తిమీర ఆకులు వేసి పచ్చివాసన పోయేలా వేయించి దింపేయాలి. మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో బాదంపప్పు, జీడిపప్పు, కిసిమిస్లను వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో అన్నం వేసి పొడి పొడిలాడేలా చేయాలి. అందులో వేయించి ఉంచుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి. దీనికి పెరుగుచట్నీ కాంబినేషన్ బావుంటుంది.
No comments:
Post a Comment