కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2ఉడికించిన కోడిగుడ్లు: 8
నూనె: 1/2
నీళ్లు: 3
ఉల్లిపాయలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
పలావ్ ఆకులు: ౨
దాల్చిన చెక్క: చిన్నది
యాలకులు: 4
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
కొత్తిమీర తురుము: 1/2cup
ఉప్పు: తగినంత
తయారు చేయు విధానం:
1. మొదటగా నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 2. రెండు నిమిషాల తర్వాత పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
3. తర్వాత కోడి గుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక నీళ్లు పోయాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టాలి.
4. మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇమిరిపోయాక, పొడిపొడిగా అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ.
No comments:
Post a Comment