ఇవి కావాలి
బంగాలళ దుంపలు : 250 గ్రా చుక్కకూర : 4 ట్టలు పెద్దవి పచ్చి మిర్చి : 8 కాయలు కారం : 1/2 చెంచా ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు ధనియాల పొడి : 1 చెంచా ఎండుమిర్చి : రెండు ఉప్పు పసుపు నూనె : కావాల్సినంత కరివేపాకు : రెండు రెబ్బలు
ఇలా చేయాలి
దుంపలు శుభ్రంగా కడిగి చెక్కుతీసి సన్నగా తరగాలి. చుక్కకూర కూడా కడిగి
సన్నగా తరిగి ఉంచాలి. బాండీ లో కొంచెం నూనెలో బంగాళదుంపలను ముప్పావు వంతు
వేపి తీయాలి. బాండీలో మిగిలిన నూనె కాగిన తర్వాత పోపుసామాను వేసి వేగిన
తర్వాత మిర్చి ఉల్లి ముక్కలు వేసి వేపి ఆలూ ముక్కలు కూడా వేసి ఉడకని
వ్వాలి. ఉడికిన తర్వాత చుక్కకూర కూడా వేసి ఉప్పు, పసుపు, కారం,ధనియాల పొడి
వేసి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి. ఉడికిన తర్వాత బాగా కలిపి దింపి
చపాతీలోకిగాని అన్నంలోకి గాని సర్వ్ చెయ్యాలి.
No comments:
Post a Comment